యజుర్వేద్, రచన, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘చిత్తం మహారాణి’. జేఎస్ మణికంఠ, టీఆర్ ప్రసాద్రెడ్డి నిర్మిస్తున్నారు. ఏ. కాశీ దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్లుక్ను దర్శకుడు సుకుమార్ విడుదలచేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘నవ్యమైన ప్రేమకథతో తెరకెక్కుతున్న చిత్రమిది. సామాజిక అంతరాల్ని దాటుకొని ఓ జంట ఎలా ఒక్కటయ్యారన్నది ఆసక్తికరంగా సాగుతుంది. కథలో ప్రతి పాత్రకు సమప్రాధాన్యముంటుంది. కొత్తదనాన్ని నమ్మి మేము చేస్తున్న ఈ ప్రయత్నం తెలుగు ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకముంది’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బుచ్చిబాబు పాల్గొన్నారు. హర్షవర్ధన్, తులసి, మధునందన్, సత్య ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హరిగౌర.