కొత్తగూడెం, నవంబర్ 15: ప్రముఖ టీవీ చానల్ నిర్వహిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ షోలో భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్కు చెందిన పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ రాజారవీం ద్ర రూ.కోటి గెలుచుకున్న ట్టు తెలిసింది. ఆయన అన్ని (15) ప్రశ్నలకూ సమాధా నం ఇచ్చారని సమాచారం. సోమవారంనాటి షోలో 11వ ప్రశ్న వరకూ వచ్చాక ఎపిసోడ్ సమయం పూర్తయింది. తదుపరి ఎపిసోడ్లో విజేతగా రాజారవీంద్రను జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించి రూ.కోటి చెక్పై సంతకం చేసి అందిస్తారని తెలిసింది.
రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి బీవీఎస్ఎస్ రాజు – శేషుకుమారి దంపతుల కుమారుడైన రాజారవీంద్ర.. ప్రస్తుతం డీజీపీ క్యాంపు కార్యాలయంలో ఎస్సైగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య సింధూజ, కుమారుడు దేవాన్ష్ కార్తికేయ, కుమార్తె కృతి అన్విక ఉన్నారు. బీటెక్, ఎంఏ ఎల్ఎల్బీ తర్వాత 2012లో పోలీసుశాఖలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని సర్కిల్ ముత్తారం పీఎస్లో ఎస్సైగా విధుల్లో చేరారు. 2015 నుంచి హైదరాబాద్లో సైబర్ క్రైంలో, సీఐడీ సైబర్క్రైంలో విధులు నిర్వహిస్తున్నారు. 2015 నుంచి పిస్టల్, రైఫిల్ కాంపిటేషన్లో తెలంగాణ పోలీస్శాఖ నుంచి వివిధ పోటీల్లో పాల్గొన్నారు.