కైరో: అంతర్యుద్ధంతో సూడాన్ మళ్లీ అల్లకల్లోలంగా మారింది. పౌర ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసింది. ఆ దేశ ఆపద్ధర్మ ప్రధాని అబ్దల్లా హమ్దోక్తో పాటు మరికొందరు నేతలను సైనిక దళాలు అరెస్టు చేశాయి. గుర్తుతెలియని ప్రాంతానికి వాళ్లను తరలించాయి. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు సైన్యాధికారి జనరల్ అబ్దుల్ ఫటా బుర్హాన్ సోమవారం ప్రకటించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. సైనిక తిరుగుబాటును నిరసిస్తూ వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. రోడ్గను దిగ్బంధనం చేసి, టైర్లకు నిప్పు పెట్టారు. భద్రతా దళాలు జరిపిన బాష్పవాయు ప్రయోగాల్లో డజను మందికి పైగా గాయాలయ్యాయి. సూడాన్లో తలెత్తిన తాజా పరిస్థితులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి.