మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 8 : విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరిన మొదటి ఏడాది నుంచే కష్టపడే తత్వం అలవర్చుకుంటే విజయం సాధిస్తారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ ఐటీ కళాశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా విద్యార్థుల నృత్యాలు, గాయనీ లక్ష్మి ఆలపించిన గీతాలు విద్యార్థులను ఉర్రూతలూగించాయి. కార్యక్రమంలో సీఎంఆర్ విద్యా సంస్థల చైర్మన్ గోపాల్ రెడ్డి, డైరెక్టర్ జంగారెడ్డి, ప్రిన్సిపాల్ సత్యనారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఘట్కేసర్: ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చి కార్పొరేటుకు ధీటుగా తీర్చిదిద్దేందుకే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఎదులాబాద్, అంకుషాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం అదనపు గదుల నిర్మాణాలకు మంత్రి మల్లారెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జంగమ్మ, ఎంపీడీవో అరుణ, సర్పంచులు జలజ, సురేశ్, వెంకటేశ్ గౌడ్, మాజీ సర్పంచ్ మూసీ శంకర్, ఎంపీటీసీలు కందుల సరళ, శోభ, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, మాజీ అధ్యక్షుడు కందుల కుమార్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, నాయకులు బి.లక్ష్మణ్ పాల్గొన్నారు.
జవహర్నగర్: దేశంలో ఎక్కడా లేని విధంగా కార్మికుల కోసం సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గబ్బిలాల్పేట 19వ డివిజన్లో కార్మిక భవనం ఏర్పాటు చేయాలని కోరుతూ కార్పొరేటర్లు శుక్రవారం మంత్రి మల్లారెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్పొరేటర్లు ఏకే మురుగేశ్, లలితాయాదవ్, నాయకులు కోటేశ్ గౌడ్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
ఘట్కేసర్ : మన బస్తీ- మన బడి కార్యక్రమంలో భాగంగా ఘట్కేసర్, కొండాపూర్ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ నిధులు రూ.58 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్తో కలిసి మంత్రి మల్లారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్యాంసన్, డీఈఓ విజయ కుమారి, కమిషనర్ వసంత, ఎంఈఓ శశిధర్, కౌన్సిలర్లు, రైతు సొసైటీ చైర్మన్ రాంరెడ్డి, మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, రైతు సంఘం మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, మేనేజర్ అంజిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.