మల్కాజిగిరి, నవంబర్ 14 : విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సెయింట్ థామస్ స్కూల్ ఫాదర్ ప్రేమ్ జాన్ అన్నారు. ఆదివారం మల్కాజిగిరి డివిజన్ వినాయక్నగర్లోని సెయింట్ థామస్ హై స్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా సైన్స్ ఫెయిర్లో సోలార్ ప్యానల్, డ్రిప్ ఇరిగేషన్, శరీరంలోని అంతర్గత అవయవాలు, ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలు, మన సంస్కృతి వంటి వాటిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఫాదర్ ప్రేమ్ జాన్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థికి తెలుసుకోవాలన్న తపన ఉంటుందని అన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి పోత్సహించడం ద్వారా రానున్నతరం వారికి మార్గదర్శకులవుతారని అన్నారు. కార్యక్రమంలో ఫాదర్ జాన్ జార్జి, ప్రధానోపాధ్యాయురాలు రీనా జాన్, ఇన్చార్జి టీచర్ దివ్వారాజ్, పూజిత, మేరిజ్యోతి తదితరులు పాల్గొన్నారు.