హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 5 : విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ శిక్షణ ద్వారా ఎప్పటికప్పుడు నైపుణ్యాలను పెంచుకోవాలని హైదరాబాద్ ఐసీబీఎం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్లెన్సీ డైరెక్టర్ డాక్టర్ జరార్ పిలుపునిచ్చారు. బుధవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ (ఐఐఎంసీ)లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా ‘రోడ్ మ్యాప్ ఫర్ కెరీర్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్’ అంశంపై నిర్వహించిన సెమినార్లో ఆయన మాట్లాడారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని అందుకు తగిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూ చించారు. కొత్త ఉద్యోగాన్ని ఎంపిక చేసుకొనే వారైనా, కాలేజీ విద్యార్థి అయినా కెరీర్ డెవలప్మెంట్ విషయంలో ఆలస్యం చేయొద్దని సూచించారు. ఈ సందర్భంగా ఇంటరాక్టివ్ సెషన్లో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. విద్యార్థులకు ఉపయోగపడే ఇలాంటి సెమినార్లు నిర్వహించినందుకు ఐఐఎంసీ ప్రిన్సిపాల్ కే రఘువీర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.