మాదాపూర్, అక్టోబర్ 30: వరల్డ్ స్ట్రోక్ డేను పురస్కరించుకొని మాదాపూర్లోని మెడికవర్ వైద్యశాలలో శనివారం స్ట్రోక్ సెంటర్తో పాటు బ్రైయిన్ స్ట్రోక్ సింపోజియాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ రంజిత్ యువ న్యూరాలజిస్టులకు అవగాహన కల్పించారు. మెదడులోని ఏదైనా ఒక భాగానికి రక్తప్రసరణ ఆగిపోయినప్పుడు స్ట్రోక్ వస్తుందని.. అప్పుడు సరైన చికిత్స చేయాలన్నారు. ఈ చికిత్స ఎంత త్వరగా మొదలు పెడితే బ్రెయిన్ డ్యామేజీని అంత త్వరగా అదుపులోకి తేవచ్చన్నారు. కార్యక్రమంలో కన్సల్టెంట్ న్యూరాలజిస్టులు డాక్టర్ రంజిత్, విక్రమ్ కిశోర్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్లు అనిల్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, క్రిటికల్ కేర్ యూనిట్ హెడ్ ఘన్మ్యామ్ ఎం. జగత్కర్, డాక్టర్ ఎల్. విజయ్ కుమార్, రేడియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ డైరెక్టర్ సతీష్ కైలాసం, నవీన్కుమార్ రెడ్డి పాల్గొన్నారు.