సిటీబ్యూరో, డిసెంబర్ 7(నమస్తే తెలంగాణ): వాహనదారుడి రోడ్డు భద్రతకు రాజీ పడొద్దని పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. మంగళవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ట్రాఫిక్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్రంకన్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్లను నిరంతరం నిర్వహించాలని తెలిపారు. ఆర్టీఓ ఆధికారులతో సమన్వయం చేసుకుని మద్యం సేవించి వాహనాలను నడిపే వారి డ్రైవింగ్ లైసెన్స్లను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాట్ స్పాట్స్లో ప్రమాదాల కారణాలను విశ్లేషించి వివిధ శాఖల అధికారులతో పనులను చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన, డ్రంకన్ డ్రైవింగ్ చేసిన వారిపై నమోదయ్యే కేసుల్లో శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.