బాలీవుడ్ అగ్ర కథానాయిక కంగనారనౌత్ ప్రయోక్తగా వ్యవహరిస్తున్న రియాల్టీషో ‘లాకప్’పై హైదరాబాద్ సిటీ సివిల్కోర్టు స్టే ఆర్డర్ విధించింది. ఏక్తాకపూర్ నిర్మిస్తున్న ఈ షోలో మునావర్ షారుఖీ, బబితా పోగట్, పూనమ్పాండే పాల్గొంటున్నారు. హైదరాబాద్కు చెందిన సానోబర్బేగ్ వేసిన పిటిషన్ను స్వీకరించిన కోర్ట్ స్టే ఆర్డర్ ఆదేశాలను జారీ చేసింది. ప్రైడ్ మీడియా సంస్థకు చెందిన సానోబర్బేగ్ ‘లాకప్’ షో ఒరిజినల్ కాన్సెప్ట్ తనదేనని..‘ది జైల్’ అనే పేరుతో రిజిస్టర్ చేసుకున్నానని తెలిపారు. షాంతన్ రే, శీర్షక్ ఆనంద్ రాసిన ఈ కాన్సెప్ట్ను కాపీరైట్ యాక్ట్ ప్రకారం తాను మార్చి 7, 2018లో రిజిస్టర్ చేసుకున్నానని సానోబర్బేగ్ చెప్పారు. ఈ షో కాన్సెప్ట్ను తన అంగీకారం లేకుండా ఏక్తాకపూర్ తస్కరించిందని ఆయన ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ది జైల్’ కాన్సెప్ట్ను యథాతథంగా కాపీ కొట్టారు. ఇది ఖచ్చితంగా సృజనాత్మక హక్కుల ఉల్లంఘన క్రిందకే వస్తుంది’ అని పేర్కొన్నారు. ఎమ్ఎక్స్ ప్లేయర్ అనే ఓటీటీ వేదికలో ఈ షోను నేటి నుంచి స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేశారు.