ఖైరతాబాద్, నవంబర్ 27 : సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమాజిగూడలో నూతనంగా ఏర్పాటుచేసిన మలబార్ గోల్డ్ షోరూంను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రోత్సాహంతో విదేశాల నుంచి పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో షోరూం మేనేజింగ్ డైరెక్టర్ అషేర్, ఖైరతాబాద్, సోమాజిగూడ కార్పొరేటర్లు పీ విజయారెడ్డి, వనం సంగీతశ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.