హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): శ్రీశైల దేవస్థానానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమించిన ధర్మకర్తల మండలి శుక్రవారం కొలువుదీరింది. దేవాదాయ కమిషనర్ ఉత్తర్వుల మేరకు ఈవో లవన్న శుక్రవారం 14 మంది సభ్యుల నూతన ధర్మకర్తల మండలి చేత ప్రమాణం చేయించారు. అనంతరం సభ్యులందరూ శ్రీరెడ్డి చక్రపాణిరెడ్డిని ఏకగ్రీవంగా ధర్మకర్తల మండలికి అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. ధర్మకర్తల మండలి అధ్యక్షుడికి, సభ్యులకు స్వామి, అమ్మవారి దర్శనం చేయించి ఈవో తీర్థప్రసాదాలు అందజేశారు.