తాండూర్ : తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) ఉద్యోగ, ఉపాధ్యాయ రాష్ట్ర అధ్యక్షుడిగా తాండూర్కు చెందిన మలిదశ ఉద్యమకారులు మాసాడి శ్రీరాములు( Sriramulu ), యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బోడ సతీష్ ( Boda Sateesh ) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర చైర్మన్, వైస్ చైర్మన్ నరాల సత్యనారాయణ, తోడేటి శంకర్ గౌడ్ నియామక పత్రాలు అందజేశారు.
తెలంగాణాలో టీయూవీని బలోపేతం చేసేందుకు నియామకాలు జరుగుతున్నట్లు శ్రీరాములు, సతీష్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు భరోసా ఇవ్వాలని, ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సమస్యల పరిస్కారం కోసం పనిచేస్తామన్నారు.
తమకు రాష్ట్ర కమిటీలో చోటు కల్పించినందుకు రాష్ట్ర నాయకులకు, జిల్లా అధ్యక్షుడు గోగర్ల రాజేష్, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి పెద్దపల్లి కిషన్ రావు, తాండూర్ అధ్యక్షుడు నిరంజన్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అర్జున్కు కృతజ్ఞతలు తెలిపారు.