హైదరాబాద్, ఫిబ్రవరి 17: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న మిక్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి(సీఈవో)గా శ్రీనివాసన్ అరుణాచలం నియమితులయ్యారు. వెటరన్ లీడర్, ఉన్నతస్థాయి ఆర్థిక డైరెక్టర్గా గత 30 ఏండ్లుగా పలు సంస్థల్లో సేవలు అందించిన ఆయన ..ప్రస్తుతం మిక్ ఎలక్ట్రానిక్స్లో చేరారు. గతంలో శ్రీనివాసన్..ఐసీఐసీఐ బ్యాంక్ గ్లోబల్ హెడ్గాను, గతి కార్పొరేషన్ సీఈవో, వీపీగాను విధులు నిర్వహించారు. ప్రస్తుతం సంస్థ ఎల్ఈడీ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్, టెలి కమ్యూనికేషన్ పరికరాలు తయారు చేస్తున్నది. వ్యాపార రంగంలో శ్రీనివాసన్కు ఉన్న అనుభవం సంస్థకు కలిసిరానున్నదని మిక్ ఎలక్ట్రానిక్స్ ఎండీ కౌశిక్ తెలిపారు.