జూబ్లీహిల్స్, ఫిబ్రవరి17: సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని గురువారం రాత్రి యూసుఫ్గూడ పోలీస్ బెటాలియన్ గ్రౌండ్స్లో టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాస కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ లోక కల్యాణాన్ని కాంక్షించి ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పేరున ఈ కల్యాణం నిర్వహించడం మహాయజ్ఞం కంటే మహోన్నతమైందన్నారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అభిలాషించే ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కాగా, తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితుల మంత్రోచ్ఛరణలతో కల్యాణం.. కమనీయంగా సాగింది. భక్తులకు తిరుపతి లడ్డూలు, తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ మహోత్సవంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ నవీన్, టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, సినీ నటులు మురళీ మోహన్, అలీ, బెనర్జీ, జీవిత, రాజశేఖర్ దంపతులు, కార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్, సీఎన్రెడ్డి, బాబాఫసియుద్దీన్, దేదీప్య, సంగీతా యాదవ్ పాల్గొన్నారు.