హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్ను శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్(ఎస్డీఎఫ్సీ) మూడో స్థానంతో ముగించింది. శనివారం జరిగిన గ్రూపు-ఎ ప్లేఆఫ్ మ్యాచ్లో ఎస్డీఎఫ్సీ 1-0 తేడాతో చర్చిల్ బ్రదర్స్పై అద్భుత విజయం సాధించింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్లో శ్రీనిధి తరఫున లాల్రోమాన్వియా(90+) ఏకైక గోల్ చేశాడు. లీగ్ ఆసాంతం నిలకడైన ప్రదర్శన కొనసాగించిన శ్రీనిధి..బరిలోకి దిగిన తొలిసారే అదరగొట్టింది. టోర్నీలో మొత్తం 18 మ్యాచ్ల్లో 9 విజయాలు, ఐదు డ్రాలు, నాలుగు ఓటములతో 32 పాయింట్లు దక్కించుకుంది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ గోకులం కేరళ(43), మొహమ్మదీన్(37) టాప్-2లో నిలిచాయి.