యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి వారి బాలాలయంలో నేటి నుంచి శ్రీదేవి శరన్నవరా త్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 15వ తేదీ (ఆశ్వీయుజ శుద్ధ దశమి దసరా) వరకు ఉత్సవాలు శాస్ర్తోక్తంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు.
9 రోజుల పాటు నవరాత్రి పూజల్లో పాల్గొనే దంపతులు రూ. 1,116, నవరాత్రిలో ఒక్కరోజు సప్త శతి పారాయణం చేయ డానికి రూ.116, లక్ష కుంకుమార్చన రూ.116 చెల్లిం చాలని తెలిపారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.