జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని జీడికల్లో బుధవారం శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచేగాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించి, తరించారు. స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు. – లింగాలఘనపురం