కొలంబో : శ్రీలంక భూభాగం జలాల్లో అక్రమంగా చేపల వేట కొనసాగించిన 54 మంది భారత జాలర్లను శ్రీలంకన్ నేవీ అధికారులు అరెస్టు చేశారు. అదేవిధంగా చేపలకు ఉపయోగించిన ఐదు బోట్లను సీజ్ చేశారు. సాధారణ పెట్రోలింగ్లో భాగంగా అక్రమ చేపల వేటను గుర్తించిన నేవీ అధికారులు భారత జాలర్లను అరెస్టు చేశారు. జాఫ్నాలోని కొవిలన్ తీరానికి మూడు నాటికల్ మైళ్ల దూరంలో చేపలు పడుతున్న 14 మంది భారత జాలర్లతో కూడిన బోటును,
పెసలాయ్కు 7 నాటికల్ మైళ్ల దూరంలో, మన్నార్కు 5 నాటికల్ మైళ్ల దూరంలో చేపలు పడుతున్న 20 మందితో కూడిన రెండు బోట్లను, అదేవిధంగా ముైల్లెటివుకు 7.5 నుంచి 8.5 నాటికల్ మైళ్ల దూరంలో 20 మంది జాలర్లతో కూడిన రెండ్ ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు అంతర్జాతీయ సరిహద్దు రేఖను దాటి శ్రీలంక జలాల్లోకి ప్రవేశించినట్లు శ్రీలంక నావికాదళం తెలిపింది.