కొలంబో, ఏప్రిల్ 28: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మంజూరు చేసిన 3 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి శుక్రవారం శ్రీలంక పార్లమెంట్ ఆమోదం తెలిపింది. కొన్ని నెలలుగా ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ద్వీప దేశానికి ఈ బెయిలవుట్ ద్వారా ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఐఎంఎఫ్ సాయాన్ని క్లిష్ట సమయంలో చారిత్రక మైలురాయిగా శ్రీలంక ప్రభుత్వం అభివర్ణించింది. అయితే ప్రధాన ప్రతిపక్షం సమగి జన బలవెగయె సభ్యులు మాత్రం ఐఎంఎఫ్ ప్యాకేజీని ఆమోదించే విషయంలో ప్రభుత్వం పారదర్శకత పాటించలేదని విమర్శించింది. ఉద్దీపన ప్యాకేజీ ద్వారా శ్రీలంకు 7 బిలియన్ల డాలర్ల వరకు ఆర్థిక సాయం లభించనున్నది.