కొలంబో, మార్చి 19: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్ర స్థాయికి చేరింది. బడుల్లో పరీక్షలు నిర్వహించడానికి కనీసం పేపర్, ఇంక్ను కూడా దిగుమతి చేసుకోలేని పరిస్థితికి శ్రీలంక దిగజారింది. పేపర్ కొరత కారణంగా శ్రీలంక పశ్చిమ ప్రావిన్స్లో పరీక్షలను నిరవధికంగా రద్దు చేశారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, విదేశీ మారక నిల్వలు నిండుకోవడంతో ప్రస్తుతం ఆ దేశం అప్పులతో నెట్టుకువస్తున్నది.