మాస్కో : ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా డెల్టా వేరియంట్ (B.1.617.2) వేరియంట్ వణికిస్తోంది. భారత్లో తొలిసారిగా గుర్తించిన B.1.617.2 వేరియంట్.. రెండో దశ కరోనా విజృంభణకు ఇదే ప్రధాన కారణమని నిపుణులు గుర్తించారు. వేరియంట్ అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అయితే, ఇప్పటికే పలు టీకాలు వేరియంట్పై సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలో డెల్టా వేరియంట్ను ఎదుర్కొనేందుకు స్పుత్నిక్-వీ కరోనా బూస్టర్ డోసును సిద్ధం చేస్తున్నట్లు రష్యాకు చెందిన గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రో బయాలజీ ప్రకటించింది. బూస్టర్ డోసును ఇతర వ్యాక్సిన్ తయారీదారులకు సైతం అందిస్తామని, ఈ మేరకు సర్దుబాటు చేసినట్లు తెలిపింది.
డెల్టా వేరియంట్పై ఇది సమర్థంగా పనిచేస్తుందని తెలిపింది. కరోనా డెల్టా వేరియంట్ (B.1.617.2) తొలుత భారత్లో గుర్తించారు. మిగిలిన వేరియంట్లతో పోలిస్తే వేగంగా విస్తరిస్తుండడంపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డెల్టాపై తన బూస్టర్ సమర్థంగా పనిచేస్తుందని స్పుత్నిక్ తెలిపింది. అంతర్జాతీయ పీర్-రివ్యూ జర్నల్లో ప్రచురణ కోసం అందించిన అధ్యయనంలో గమలేయ పేర్కొంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే స్పుత్నిక్ వీ వ్యాక్సిన్కు ఏప్రిల్లో డీసీజీఐ నుంచి అత్యవసర వినియోగం కింద అనుమతి పొందిన మూడో టీకా. హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ రష్యా నుంచి వ్యాక్సిన్లను దిగుమతి చేసుకోవడంతో మార్కెట్లోకి తేనుంది. దిగుమతి చేసుకున్న వ్యాక్సిన్లను ప్రైవేటు ఆసుపత్రుల్లో వేస్తుండగా.. టీకా ధరను రూ.1,145గా భారత ప్రభుత్వం నిర్ణయించింది.