పాంపిలోసా : స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో తీవ్రమైన నీటి కరువు ఏర్పడింది. రెండు దేశాల్లోనూ వర్షాలు లేక రైతులు, జనం నీళ్ల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శీతాకాలంలోనూ ఆ రెండు దేశాల్లో తీవ్ర నీటి సమస్య ఏర్పడింది. గడిచిన 20 ఏళ్లలో ఎన్నడూ ఇలాంటి కరువును చూడలేదని స్థానికులు అంటున్నారు. అనేక చెరువుల్లో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. దీంతో స్థానిక రైతులు, నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్పెయిన్లోని పలు ప్రాంతాల్లో కనీస స్థాయి కన్నా తక్కువగా నీటి నిల్వలు ఉన్నాయి. రాబోయే సమ్మర్లో పరిస్థితి మరింత విపత్కరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక పోర్చుగల్లో ఓ భారీ చెరువు అడుగంటడంతో అక్కడ ఉన్న పురాతన కట్టడాలు బహిర్గతం అయ్యాయి. జెజిరే నదిపై ఉన్న డ్యామ్లో నీటి సామర్థ్యం పూర్తిగా పడిపోయింది. పోర్చుగల్లో ఉన్న 55 డ్యామ్ల్లో.. 24 రిజర్వాయర్లలోనే నీటి సామర్థ్యం సగం ఉంది. టారిస్టు కేంద్రమైన అల్గర్వేలో నీటి కరువు విలయతాండవం ఆడుతోంది. వర్షాలు లేని కారణంగా.. పంటలు దెబ్బతింటున్నాయని, జంతువులకు మేత దొరకడం లేదని, హైడ్రో విద్యుత్తు ఉత్పత్తి కూడా తగ్గినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.