జొహానెస్బర్గ్: దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా పిడికిలెత్తిన ఉద్యమకారుడు.. నెల్సన్ మండేలా, అహ్మద్ కత్రాడా వంటి ఉద్ధండులతో కలిసి జైలు జీవితాన్ని గడిపిన భారత సంతతి వ్యక్తి ఇబ్రహీం ఇస్మాయిల్ ఇబ్రహీం (84) కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం జొహానెస్బర్గ్లోని తన ఇంటిలో మరణించారని దక్షిణాఫ్రికా అధికార పార్టీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ తెలిపింది. దక్షిణాఫ్రికా అభివృద్ధి కోసం ఆయన తన జీవితాన్నే త్యాగం చేశారని, ఆయన మరణం తీరని లోటని పేర్కొంది. ఇబ్రహీంను దక్షిణాఫ్రికా ప్రజలు ముద్దుగా ‘కామ్రేడ్ ఎబీ’ అని పిలుస్తారు.