క్రైస్ట్చర్చ్: తొలి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య పరాజయం ఎదుర్కున్న దక్షిణాఫ్రికా.. రెండో టెస్టుపై పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్లో మంచి స్కోరు చేసిన దక్షిణాఫ్రికా.. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. డసెన్ (45) రాణించాడు. చేతిలో 5 వికెట్లు ఉన్న సఫారీ జట్టు ఓవరాల్గా 211 పరుగుల ఆధిక్యంలో ఉంది.