న్యూఢిల్లీ : ఐర్లాండ్ వేదికగా జరిగిన ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ టోర్నీలో భారత స్టార్ క్యూయిస్టు సౌరవ్ కొతారీ చాంపియన్గా నిలిచాడు. గురువారం జరిగిన ఫైనల్లో సౌరవ్ 725-480 పాయింట్ల తేడాతో ఏస్ క్యూయిస్టు పంకజ్ అద్వానీపై అద్భుత విజయం సాధించాడు. ఇటీవలి చాంపియన్షిప్ చరిత్రను పరిశీలిస్తే..ఏకంగా 325 పాయింట్లతో సౌరవ్ అద్భుతమైన బ్రేక్ సాధించాడు. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వని సౌరవ్ 119, 112 స్కోర్లతో గేమ్పై పట్టు నిలబెట్టుకున్నాడు. ఈ క్రమంలో తన కెరీర్లో తొలిసారి ఐబీఎస్ఎఫ్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. సరిగ్గా 35 ఏండ్ల క్రితం సౌరవ్ తండ్రి, దిగ్గజ క్యూయిస్టు మనోజ్ కొతారీ ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఐబీఎస్ఎఫ్ టైటిల్తో పాటు డబ్ల్యూబీఎల్ వరల్డ్ బిలియర్డ్స్ టైటిళ్లు గెలిచిన మూడో భారత ప్లేయర్గా సౌరవ్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు.