కోల్కతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని కోల్కతాలోని వుడ్లాండ్ దవాఖాన వెల్లడించింది. దాదాకు చికిత్స అందిస్తున్నామని.. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఎలాంటి జ్వరం లేదని.. కంగారు పడాల్సిన అవసరం లేదని దవాఖాన ఎండీ, సీఈవో డాక్టర్ రూపాలీ బసు స్పష్టం చేశారు. గంగూలీ రాత్రంతా పడుకున్నారని, భోజనం కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా సోకడంతో దాదా సోమవారం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.