హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన రవీందర్సింగ్ గురువారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సంస్థల సమస్యలతోపాటు సిక్కు సామాజికవర్గం ఎదురొంటు న్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చినట్టు రవీందర్సింగ్ తెలిపారు. ఆయన వెంట నాయకులు సాదవేణి శ్రీనివాస్, గుంజపడుగు హరిప్రసాద్, దండబోయిన రాము, వినయ్, సికు సామాజికవర్గం నాయకులు ఎక్బల్సింగ్, అర్బన్సింగ్, ఇం దర్సింగ్, దర్శన్సింగ్ తదితరులు ఉన్నారు.