శంషాబాద్ రూరల్, మార్చి 18: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్కు శుక్రవారం శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీలో జరిగిన ట్రయల్స్లో ప్రత్యర్థులపై అద్భుత విజయాలు సొంతం చేసుకున్న నిఖత్..ప్రతిష్ఠాత్మక ప్రపంచ చాంపియన్షిప్తో పాటు ఆసియా గేమ్స్కు అర్హత సాధించింది. చైనాలో జరిగే ఆసియా గేమ్స్కు బెర్తు దక్కించుకున్న తొలి రాష్ట్ర ప్లేయర్గా నిలిచిన ఈ ఇందూరు బాక్సర్కు క్రీడాభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, రాష్ట్ర బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు మన్మోహన్, భారత మాజీ కోచ్ చిరంజీవి, తెలంగాణ ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు ప్రేమ్రాజ్ పాల్గొన్నారు.