న్యూఢిల్లీ, నవంబర్ 16 : సోషల్ మీడియా వ్యవస్థ ఒక అరాచక శక్తి అని, దానిపై నిషేధం విధించాల్సిన అవసరం ఉందని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తి పేర్కొన్నారు. మంగళవారం నేషనల్ ప్రెస్ డే సందర్భంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సమాజంలో సోషల్ మీడియా ఒక ప్రతిబంధకంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గురుమూర్తి వ్యాఖ్యలను కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కౌన్సిల్ సీనియర్ సభ్యులు వ్యతిరేకించారు. సోషల్ మీడియాకు అనేక సానుకూల అంశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.