ముంబై, నవంబర్ 9: తీవ్ర ఊగిసలాటలో కదలాడిన దేశీయ స్టాక్ మార్కెట్లు పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల వార్తలు వచ్చినప్పటికీ దేశీయంగా ఎలాంటి అనుకూల వార్తలు లేకపోవడంతో బ్లూచిప్ సంస్థల షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ప్రారంభం నుంచి లాభాలబాట పట్టిన దేశీయ స్టాక్ ఎక్సేంజ్ బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు నష్టాల పాలైంది. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 112.16 పాయింట్లు తగ్గి 60,433.45 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 24.30 పాయింట్లు తగ్గి 18,044.25 వద్ద ముగిసింది. ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ రంగానికి చెందిన షేర్లు పతనమవడం సూచీల పతనాన్ని చవిచూసింది.