ఫిలిప్స్బర్గ్, జనవరి 20: పంటలను నాశనం చేస్తున్నాయని ఆఫ్రికాలోని సింట్ మార్టెన్ దేశం కోతులను చంపుతున్నది. దక్షిణ, తూర్పు ఆఫ్రికాలో కనిపించే వెర్వెట్ జాతి కోతులు పంటలపై పడి నాశనం చేస్తున్నాయి. దీంతో తిండి గింజలకు కొరత ఏర్పడి ఆహార భద్రతకు విఘాతం ఏర్పడుతున్నది. దేశవ్యాప్తంగా రైతులు కోతుల బెడదపై ఆందోళన వ్యక్తం చేయటంతో అక్కడి ప్రభుత్వం వాటిని చంపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోతులను చంపే చర్యలను విరమించుకోవాలని పలు స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.