హైదరాబాద్, ఏప్రిల్ 27(నమస్తే తెలంగాణ): కోలకతా వేదికగా జరిగిన కోల్ఇండియా క్రీడల్లో తెలంగాణ ప్లేయర్లు పతకాల హవా కొనసాగించారు. బుధవారంతో ముగిసిన టోర్నీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర సింగరేణి క్రీడాకారులు 14 పతకాలు కొల్లగొట్టారు. నాలుగు స్వర్ణాలు సహా నాలుగు రజతాలు, ఆరు కాంస్య పతకాలు ఉన్నాయి. సింగరేణి నుంచి మొత్తం 29 మంది పోటీలో పాల్గొనగా పవర్లిఫ్టింగ్ నుంచి ఆనందరావు, రాజయ్య, శ్రీనివాస్రెడ్డి, తిరుపతి, వెయిట్లిఫ్టింగ్లో భాస్కరాచారి, అనిల్కుమార్, ప్రకాశ్, సత్తయ్య, మనోహర్, బాడీబిల్డింగ్లో సమ్మయ్య, మోజిలి, రామకృష్ణ, సత్యనారాయణ, వెంకటస్వామి పతకాలు ఖాతాలో వేసుకున్నారు. ముగింపు కార్యక్రమానికి దిగ్గజ వెయిట్లిఫ్టర్ కరణం మల్లీశ్వరి హాజరై విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కోల్ ఇండియా కార్యనిర్వాహక సంచాలకులు మనోజ్కుమార్సింగ్ తదితరులు పాల్గొన్నారు.