హైదరాబాద్ : ప్రవచనామృతంతో సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ ప్లవ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతోంది. ప్రపంచ ప్రఖ్యాత కవి, గ్రంధకర్త, ఆధ్యాత్మిక ప్రవచనకారులు, ఋషిపీఠం సంస్థాపకులు, గురువర్యులు పూజ్య బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ప్రవచన కార్యక్రమాన్ని సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా సింగపూర్ గాయనీగాయకులచే “శివపదం” భక్తి గీతాలాపనను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ నెల 11వ తేదీన భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు సోషల్ మీడియా వేదికల ద్వారా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు..
యూట్యూబ్ :
https://youtube.com/c/SriSamskruthikaKalasaradhi
ఫేస్బుక్ :
https://www.facebook.com/Sri-Samskrutika-Kalasaradhi-Singapore-108993030870390/
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ ఈ కార్యక్రమాన్ని వీక్షించి భగవదనుగ్రహాన్ని, గురువుగారి ఆశీస్సులను పొందగలరని ఆశిస్తున్నట్లు సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ ప్రధాన కార్యనిర్వాహకవర్గం కోరింది.