కౌలాలంపూర్: హైదరాబాదీ షట్లర్ పీవీ సింధు.. ఈ యేటి సింగపూర్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్లో ఆమె జపాన్కు చెందిన సయినా కవకామీని ఓడించింది. కేవలం 31 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో పీవీ సింధు 21-15, 21-7 స్కోరు తేడాతో నెగ్గింది. సూపర్ 500 టోర్నీలో ఫైనల్ చేరడం ఈ ఏడాది ఇదే మొదటిసారి. మెడల్కు మరో అడుగు దూరంలో సింధు ఉంది. ఈ మ్యాచ్లో 2-0 తేడా ఆధిక్యంతో జపాన్ ప్లేయర్తో పోటీ పడింది. 2018లో చైనా ఓపెన్లో ఓసారి కవకామీతో సింధు ఆడింది. వరల్డ్ నెంబర్ 38వ స్థానంలో ఉన్న కవకామీపై సింధు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఓపెనింగ్ గేమ్లో జపాన్ క్రీడాకారణి కొంత గట్టి పోటీ ఇచ్చినా.. రెండవ గేమ్లో మాత్రం సింధు ఈజీగా దూసుకువెళ్లింది. ఫోర్హ్యాండ్ అటాకింగ్ రిటర్న్స్తో పాటు బ్యాక్హ్యాండ్ ఫ్లిక్స్తో సింధు ఆకట్టుకున్నది.