సూర్యాపేట సిటీ, నవంబర్ 12: విచారణ పేరుతో గిరిజన యువకుడిని చితకబాదిన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) ఎస్సై లింగంను సస్పెండ్ చేస్తూ ఎస్పీ రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రామోజీతండాకు చెందిన గిరిజన యువకుడు వీరశేఖర్ను విచారణ పేరుతో ఎస్సై లింగం చిత్రహింసలకు గురిచేశారని బాధితుడి బంధువులు, గ్రామస్థులు గురువారం పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం ఎస్సైని సస్పెండ్ చేసినట్ట ఎస్పీ పేర్కొన్నారు.