న్యూఢిల్లీ, డిసెంబర్ 6: శ్రీరామ్ ప్రాపర్టీస్ ఈ నెల 8 నుంచి ఐపీవోకి రాబోతున్నట్లు ప్రకటించింది. షేరు ధరల శ్రేణిని రూ.113-118గా నిర్ణయించింది. ఈ నెల 10న ముగియనున్న ఈ ఐపీవో ద్వారా గరిష్ఠంగా రూ.600 కోట్లు సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నది. గతంలో రూ.800 కోట్లు అంచనావేసిన సంస్థ.. దీనిని రూ.600 కోట్లకు తగ్గించింది. దీంట్లో ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.350 కోట్లు సేకరించాలనుకుంటుండగా, మిగతా రూ.250 కోట్లు తాజా షేర్లను జారీ చేయడం ద్వారా సమీకరించనున్నది.