టోక్యో : ఒలింపిక్స్ రెజ్లింగ్లో భారత్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మహిళల 53 కేజీల బరువు విభాగంలో క్వార్టర్ ఫైనల్లో భారత నెంబర్ వన్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఓటమిపాలైంది. బెలారస్ రెజ్లర్ వెనెస్సా కలడ్జింసక్యా చేతిలో పరాజయం పాలైంది. బుధవారం ఉదయం జరిగిన ప్రీక్వార్టర్స్లో వినేశ్ ఫోగాట్ తొలి రౌండ్లో స్వీడన్ రెజ్లర్ సోఫియా మాట్సన్ సోఫియాను 7-1 తేడాతో మట్టికరిపించింది. వినేశ్ ఫోగట్ మ్యాచులో ప్రత్యర్థిపై ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. దూకుడుగా ఆడుతూ పాయింట్లు సాధించి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. అనంతరం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్లో బెలారస్ రెజ్లర్ చేతిలో 9-3 తేడాతో పరాజయం పాలైంది. అయితే, ఓటమి తర్వాత పతకం రేసులో ఉన్నా.. రీఛేజ్ మ్యాచ్లో పోటీపడాల్సిన పరిస్థితి ఎదురైంది.