Shobha Shetty | కార్తీక దీపం సీరియల్లో మోనిత పాత్రలో, తన విలనిజంతో అందరినీ ఆకట్టుకున్న చిన్నది శోభా శెట్టి. ఈ అమ్మడికి ఫుల్ పాపులారిటీ ఉంది. బిగ్ బాస్కు వెళ్లిన తర్వాత శోభా శెట్టి తన పాపులారిటీ మరింత పెంచుకుంది. సీరియల్లో మాత్రమే కాదు బిగ్ బాస్ హౌజ్లోను తన విలనిజం మార్క్ చూపిస్తూ అందరిని కట్టిపడేసింది. బిగ్ బాస్ 7లో పాల్గొన్న తర్వాత శోభా శెట్టి క్రేజ్ మరింత పెరిగింది. హౌజ్ నుండి బయటకు వచ్చాక పలు సీరియల్స్, షోస్ చేస్తూ బిజీగా గడిపేస్తుంది. ఆ మధ్య కన్నడ బిగ్ బాస్ హౌజ్లో కూడా సందడి చేసింది. కాకపోతే అనారోగ్య సమస్యలతో ముందే బయటకు వచ్చేసింది.
శోభా శెట్టి ఈ మధ్య టీవీ షోస్ తప్పితే ఏ సీరియల్ లోనూ కనిపించడం లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన క్యూట్ ఫొటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా తన సోషల్ మీడియా ఫాలోవర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ‘కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరం కాబోతున్నాను’ అంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టి అందరు షాక్ అయ్యేలా చేసింది. ఉన్నట్టుండి శోభా శెట్టి ఇలా సోషల్ మీడియాకి దూరం కావడం ఏంటని అందరు ఆశ్చర్యపోతు సడెన్గా ఎందుకు బ్రేక్ తీసుకుంటుందో, అసలు ఏం జరిగిందో అని ఆమె ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు.
శోభా శెట్టి ఇటీవల కార్తీక దీపం సీరియల్ సెకండ్ హీరోతో ఎంగేజ్మెంట్ చేసుకుంది . అయితే పెళ్లిని మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉంచింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కాబోయే వాడితో కలిసి కొత్త ఇల్లు కొనుక్కుంది. మరి ఏమయ్యిందో ఇంత సడెన్ గా సోషల్ మీడియాకి బై చెప్పడం ఏంటో తెలీడం అంటూ ఫాన్స్ బాగా హర్ట్ అవుతున్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్యూటీ గార్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేయగా, అది కూడా సాఫీగా జరగడం లేకపోవడంతో ఈ అమ్మడు డిప్రెషన్లోకి వెళ్లినట్టు తెలుస్తుంది.