ఇస్లామాబాద్, ఏప్రిల్ 10: ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్మాస తీర్మానంపై శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఓటింగ్లో ఇమ్రాన్ఖాన్ ఓడిపోవడంతో పాకిస్థాన్కు కొత్త ప్రధాని ఎన్నిక ప్రక్రియ మొదలైంది. దీనికి సంబంధించి జాతీయ అసెంబ్లీ సోమవారం మరోసారి ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఎంపీలు కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పీఎంఎల్-ఎన్ పార్టీ నేత షెహబాజ్ షరీఫ్(మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు) ఆదివారం నామినేషన్ వేశారు. తాజా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పీటీఐ తరపున మాజీ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీని అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఇద్దరి నామినేషన్లను జాతీయ అసెంబ్లీ సెక్రటేరియట్ ఆమోదించింది. శనివారం అర్ధరాత్రి జరిగిన ఓటింగ్ లో 174 ఓట్లతో విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని నె గ్గించుకున్న నేపథ్యంలో షెహబాజ్ ఎన్నిక లాంఛనం కానున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు పీఎంగా షెహబాజ్ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా తమ సభ్యుల చేత రాజీనామాలు చేయించి, కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని ఇమ్రాన్ నివాసంలో జరిగిన సమావేశంలో పీటీఐ నిర్ణయం తీసుకున్నది. అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంపై ఇమ్రాన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘స్వత్రంత దేశంగా పాక్ 1947లో ఆవిర్భవించింది. కానీ, ప్రధానిగా తనను మార్చేందుకు జరిగిన విదేశీ కుట్రకు వ్యతిరేకంగా మళ్లీ స్వాతంత్య్ర పోరాటం మొదలైంది’ అని ఆదివారం ట్వీట్ చేశారు.
ఫాస్ట్ట్యాగ్ వినియోగదారులు తమ వాహనాలపై ఉండే ప్రస్తుత ట్యాగ్ను మార్చుకోవచ్చు. కొత్తది తీసుకోవచ్చు. ఈ విధానం జూన్ 30 నుంచి అమల్లోకి రానున్నది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఫాస్ట్ట్యాగ్ అమలు నిబంధనల్లో మూడు కొత్త మినహాయింపు కోడ్లను చేర్చడంతో ఈ మేరకు వెసులుబాటు కలిగింది. ఇప్పటి వరకు వాహనానికి ఫాస్ట్ట్యాగ్ లింకేజ్ శాశ్వతంగా ఉండేలా నిబంధన ఉండేది.