దుండిగల్, ఫిబ్రవరి 28: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులతో 5 రోజులుగా బంకర్లోనే నరకం అనుభవిస్తున్నదో తెలంగాణ విద్యార్థిని. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ షాపూర్నగర్కు చెందిన నల్లోల కల్పన.. ఉక్రెయిన్లోని కార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్నది. యుద్ధం ప్రారంభమైన వెంటనే బంకర్లోకి వెళ్లి తలదాచుకొన్నది. ఐదు రోజులుగా తిండి లేక ఇబ్బంది పడుతున్నట్టు తల్లిదండ్రులకు వీడియో పంపింది. భారత ఎంబసీ నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్రంతో మాట్లాడి తమ కూతురిని రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్కు కల్పన తండ్రి నల్లోల మురళి విన్నవించారు.