సిటీబ్యూరో, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ): శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో 11 హై రిస్క్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల కో సం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్పోర్టు అధికారులు పేర్కొన్నారు. పలు దేశాల్లో కొత్త స్ట్రెయిన్ ఓమిక్రాన్ ద్వా రా ఇన్ఫెక్షన్ కేసులు పెరగడంతో కేంద్రం ఇటీవల నూత న మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు.
ఇంటర్నేషనల్ అరైవల్ హాల్ వద్ద ప్రీ-ఇమ్మిగ్రేషన్లో ప్రత్యేక కొవిడ్-19 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చేసుకోవాలన్నారు. టెర్మినల్ అంతటా స్టిక్కర్లు, పోస్టర్ల ద్వారా ఆర్టీ-పీసీఆర్/ర్యాపిడ్ పీసీఆర్ కోసం సూచికలను కూడా ఏర్పాటు చేశారు. కాగా, పరీక్ష ల కోసం ముందస్తు బుకింగ్ ప్రకియను కూడా అధికారు లు ఏర్పాట్లు చేశారు.
www.hyderabad.aero లింకు ద్వారా లేదా ల్యాబ్ వెబ్సైట్ http://covid.mapmygenome.in ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆర్టీ-పీసీఆర్కు రూ.750 (6 గంటల నిరీక్షించా లి), ర్యాపిడ్ పీసీఆర్ రూ.3,900 (2గంటల సమయం) వేచి ఉండాలి. GHIAL ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పా టు చేశారు. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం సీటింగ్, ఫుడ్ అండ్ బేవరేజెస్, ఫారిన్ ఎక్సేంజ్, పేమెంట్ కౌంటర్లతో ప్రత్యేక వెయిటింగ్ ఏరియాను కేటాయించారు.
దివ్యాంగుల కోసం ప్రత్యేక కేంద్రాలున్నాయన్నారు. డా క్యుమెంటేషన్ తనిఖీలో సాయం చేయడానికి ప్యాసింజర్ అసోసియేట్లను నియమించినట్లు ఎయిర్పోర్టు హెల్త్ ఆఫీసర్ చెప్పారు. డిసెంబర్ 5 నాటికి మొత్తం 1443 మంది ప్రయాణికులు రాగా, 13 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరిని గచ్చిబౌలి టిమ్స్కు తరలించారు.