శామీర్పేట, నవంబర్ 24 : శామీర్పేట కట్టమైసమ్మ దేవాలయాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఉద్యమ సమయంలో శామీర్పేట చెరువు వద్ద చేసిన కార్యక్రమాలను గుర్తు చేశారు. అనంతరం చెరువు వద్ద ప్రభుత్వం చేపడుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో శామీర్పేట కట్టమైసమ్మ దేవాలయం, చెరువు మంచి పర్యాటక ప్రాంతం గా మారనుందన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, సర్పంచ్ హరిమోహన్రెడ్డి, నాగరాజుచారి, సాజిద్, స్థానికులు పాల్గొన్నారు.