కమెడియన్గా, కామెడీ హీరోగా నటించిన షకలక శంకర్ తొలిసారిగా సామాజిక సందేశం జోడించిన కథలో హీరోగా నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థలి’. పావని నాయిక. రమణ మొగిలి దర్శకుడు. రొచిశ్రీ మూవీస్ పతాకంపై నిర్మాత ఎంఆర్ రావు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ మన జీవితాలతో ముడిపడిన ఓ విషయాన్ని మన జీవితాలతో ఆడుకుంటున్న అంశాన్ని షకలక శంకర్ పాత్ర ద్వారా తెలియజేస్తున్నాం.
పక్కా కమర్షియల్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో వుండే సందేశం అందర్ని ఆలోచింపజేసే విధంగా వుంటుంది. జనవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.