బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘పఠాన్’. ‘వార్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పడుకోన్, జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఐదేళ్ల విరామం తర్వాత రాబోతున్న షారుఖ్ చిత్రంగా ‘పఠాన్’ అభిమానుల్లో అంచనాల్ని పెంచుతున్నది. వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కులకు సంబంధించిన వార్తొకటి బాలీవుడ్ సర్కిల్స్లో వైరల్గా మారింది. ఈ చిత్ర డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ 200కోట్ల భారీ మొత్తానికి చేజిక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాణ సంస్థ యష్రాజ్ ఫిల్మ్స్ ఈ వార్తల్ని ఖండించలేదు. దాంతో డీల్ కుదిరిందని ముంబయి ట్రేడ్ వర్గాలంటున్నాయి. అదేగనుక నిజమైతే బాలీవుడ్ డిజిటల్ రైట్స్లో ‘పఠాన్’ రికార్డు సృష్టించినట్లేనని చెబుతున్నారు. ప్రస్తుతం రాజ్కుమార్ హిరాణి రూపొందిస్తున్న ‘డంకీ’ చిత్రంలో నటిస్తున్నారు షారుఖ్ఖాన్. వీరిద్దరి కాంబినేషన్లో తొలి చిత్రమిదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.