Bowrampet | దుండిగల్: బౌరంపేట మైనారిటీ బాయ్స్ హాస్టల్ (Minority Boys Hostel)లో 5వ తరగతి విద్యార్థిపై లైంగిక దాడి జరిగింది. అదే హాస్టల్కు చెందిన ముగ్గురు మైనర్ బాలురు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయంపై దుండిగల్ పోలీసులను ఆశ్రయించారు బాధితుడి తండ్రి. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు.
కేసుకు సంబంధించిన ఆధారాలను (Clues) పోలీసులుసేకరిస్తున్నారు. నిందితులు కూడా మైనర్లే కావడంతో జువైనల్ జస్టిస్ బోర్డు నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టనున్నారు. మైనారిటీ హాస్టల్లో భద్రత, వార్డెన్ల పర్యవేక్షణ లోపంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.