బెంగళూరు, అక్టోబర్ 27: కర్ణాటకలో ప్రస్తుతం ఏడుగురు డెల్టా ప్లస్ వేరియంట్తో బాధపడుతున్నారని రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషన్ రణ్దీప్ తెలిపారు. ఏడు కేసుల్లో మూడు బెంగళూరులోనే నమోదయ్యాయని పేర్కొన్నారు. కొత్త వేరియంట్తో మరణాలు సంభవించలేదని చెప్పారు. కాగా, అండమాన్లో గడిచిన 24 గంటల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటివరకు ఇక్కడ 7,648 మంది కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం నాలుగు యాక్టివ్ కేసులున్నాయి.