హైదరాబాద్ : మార్చి 2021 నెలలో మహాశివరాత్రి(11వ తేదీ), హోళి(29వ తేదీ) మినహా అన్ని రోజులు(ఆదివారాలు, రెండవ శనివారం సహా) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సేవలు అందుబాటులో ఉండనున్నాయి. రిజిస్ట్రేషన్, స్టాంపుల ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు గురువారం సీఎస్ సోమేశ్కుమార్ను నగరంలోని బీఆర్కేఆర్ భవన్లో కలిశారు. రిజిస్ట్రేషన్ శాఖలో అన్ని స్థాయిల్లో అతి తక్కువ సమయంలో పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేసినందుకు సీఎం కేసీఆర్కు, సీఎస్కు అసోసియేషన్ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు క్లియర్ అయ్యేలా గత రెండు నెలలుగా మంచి సేవలు అందిస్తున్నందుకు రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బందిని సీఎస్ అభినందించారు.
రిజిస్ట్రేషన్లకు గల డిమాండ్, ఈ ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్నందున మార్చి, 2021 మాసంలో అన్ని ఆదివారాలు, రెండవ శనివారం పనిచేస్తామని అసోసియేషన్ సభ్యులు ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. తదనుగుణంగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను అన్ని అదివారాలు (మార్చి 7, 14, 21, 28), రెండవ శనివారం (మార్చి 13) లలో కూడా పనిచేసేందుకు తెరిచి ఉంచనున్నారు. కావున అన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాలు మార్చి మాసంలో మహాశివరాత్రి (మార్చి 11), హోళి(మార్చి 29) రోజులలో తప్ప మిగతా అన్ని రోజులలో తెరిచి ఉంటాయన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
ఈ సమావేశంలో స్టాంపులు, రిజిష్ట్రేషన్ల కమిషనర్, ఐజీ శేషాద్రి , అసోసియేషన్ ప్రెసిడెంట్ స్ధిత ప్రజ్ఞ, కన్వీనర్, టీఎన్జీవో హైదరాబాద్ నగర అద్యక్షుడు ముజిబ్, అసోసియేట్ ప్రెసిడెంట్ సహదేవ్, అసోసియేషన్ సభ్యులు ప్రణయ్ కుమార్, సిరాజ్ అన్వర్, నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.