అకోలా: మహారాష్ట్రలోని శివసేన పార్టీకి చెందిన మంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు మరికొంత మంది పార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఆచూకీ లేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్ కనిపించడం లేదని ఆయన భార్య ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అకోలా జిల్లాలోని బాలాపూర్ నియోజకవర్గం నుంచి శివసేన తరపున నితిన్ దేశ్ముఖ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అకోలాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే భార్య ప్రాంజలి దేశ్ముఖ్ ఫిర్యాదు చేసింది. సోమవారం రాత్రి నుంచి తన భర్త ఆచూకీ చిక్కడం లేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నది. మరో వైపు చీఫ్ విఫ్ పదవి నుంచి ఏక్నాథ్ను శివసేన తొలిగించింది. రెబెల్గా మారిన ఏక్నాథ్ ప్రస్తుతం సూరత్లో కొంత మంది ఎమ్మెల్యేలతో ఉన్నట్లు తెలుస్తోంది.