న్యూఢిల్లీ: టాపార్డర్ రాణించడంతో బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. తొలి రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ (70), కీగన్ పీటర్సన్ (64), టెంబ బవుమా (67) అర్ధశతకాలు సాధించగా.. ర్యాన్ రికెల్టాన్ (42) ఫర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 3, ఖాలెద్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం వెరినే (10), ముల్డర్ (0) క్రీజులో ఉన్నారు. రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా తొలి టెస్టును దక్షిణాఫ్రికా గెలుచుకున్న విషయం తెలిసిందే.