కోల్కతా: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్లో శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎస్డీఎఫ్సీ)గెలుపు జోరు కొనసాగుతున్నది. గత మ్యాచ్లో రౌండ్గ్లాస్ పంజాబ్ను చిత్తుచేసిన ఎస్డీఎఫ్సీ అదే దూకుడు కనబరిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఎస్డీఎఫ్సీ 1-0 తేడాతో సువేదా ఢిల్లీపై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఎస్డీఎఫ్సీ..బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకుంటూ దాడులకు పూనుకుంది. ఈ క్రమంలో మ్యాచ్ 39వ నిమిషంలో లభించిన ఫ్రీకిక్ను డేవిడ్ మునోజ్ గోల్ చేయడంతో ఎస్డీఎఫ్సీ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.